HomeCRIMEఈజీ మనీ కోసం తుపాకుల బేరం.. పోలీసుల వలలో చిక్కిన బీహార్ వాసులు

ఈజీ మనీ కోసం తుపాకుల బేరం.. పోలీసుల వలలో చిక్కిన బీహార్ వాసులు

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

ఇతర రాష్ట్రం నుంచి నాటు తుపా విని తీసుకువచ్చి దానిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను పేట్ బషీరాబాద్, శేర్లింగంపల్లి ఎస్.ఓ.టి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

_ రైలు మార్గంలో బక్సర్ నుంచి నగరానికి మారణాయుధాల స్మగ్లింగ్

_ దూలపల్లిలో కస్టమర్లకు విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టివేత

_ శేరిలింగంపల్లి SOT, పేట్‌బషీరాబాద్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్

_ 7.65 ఎంఎం పిస్టల్, ఎనిమిది సజీవ గుండ్లు (లైవ్ రౌండ్స్), రెండు ఖాళీ మ్యాగజైన్ల సీజ్

_ నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి

లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో అక్రమ ఆయుధాల వ్యాపారానికి ఒడిగట్టిన ఇద్దరు వలస కార్మికులు కటకటాలపాలయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. సోమవారం విలేకరుల సమావేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వివరించారు.

మీడియాకు వివరాలను వెల్లడిస్తున్న కుత్బుల్లాపూర్ జోన్ డిసిపి కోటిరెడ్డి…

**వలస వచ్చి.. అడ్డదారులు తొక్కి:**

బీహార్‌లోని రోహతాస్ జిల్లాకు చెందిన వికాస్ కుమార్ (22), వంశరాజ్ రామ్ (31) ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చారు. వీరు కొంతకాలంగా దూలపల్లి ప్రాంతంలో అద్దెకు ఉంటూ దినసరి కూలీలుగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అయితే, తాము చేసే పనిలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎలాగైనా ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే అక్రమంగా తుపాకులు తెచ్చి అమ్మేందుకు సిద్ధమయ్యారు.

**రైలులో స్మగ్లింగ్.. పక్కా స్కెచ్‌తో పట్టివేత:**

నిందితులు బీహార్‌కు చెందిన కాజల్ సింగ్ అనే ఆయుధాల వ్యాపారి వద్ద ఒక దేశవాళీ (నాటు) తుపాకీని కొనుగోలు చేశారు. దాన్ని బక్సర్ జిల్లా నుంచి రైలులో ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత రహస్యంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ ఆ తుపాకీని భారీ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నారు.ఈ క్రమంలో ఏప్రిల్ 20న శేరిలింగంపల్లి ఎస్ఓటీ మరియు పేట్ బషీరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన బృందాలు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. దూలపల్లి సమీపంలోని వికాస్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద తుపాకీని అమ్మేందుకు కస్టమర్ల కోసం అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరినీ పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నిందితులును రిమాండ్ కు తరలిస్తున్న పోలీసులు…

**ఆయుధ చట్టం కింద కేసులు:**

నిందితుల వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు, లైసెన్స్ లేకపోవడంతో వారి నుంచి ఒక 7.65 mm నాటు పిస్టల్, 8 సజీవ గుండ్లు (బుల్లెట్లు), 2 ఖాళీ మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికాస్, వంశరాజ్‌లపై ఆయుధ చట్టం (Arms Act) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో వీరికి ఇంకెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ముఠాను పట్టుకోవడంలో అడిషనల్ డీసీపీలు శోభన్ కుమార్, గోవర్ధన్, ఏసీపీ శంకర్ రెడ్డి, ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి, పేట్‌బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

నిందితుల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న అటు తుపాకీ, బుల్లెట్లు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments